తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (25.04.2024) పులివెందులలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 7.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ స్ధానిక సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు, కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.