విజయనగరం: పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం చేరుకున్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం వైయస్ జగన్ సభా స్థలిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల స్టాల్స్ను పరిశీలించారు.