అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌

4 Oct, 2019 18:14 IST

విజయవాడ: ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరఫున సీఎం వైయస్‌ జగన్‌ తొలి సారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గ గుడిని దర్శించుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, తదితరులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు.