దేవీపట్నం బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

16 Sep, 2019 11:47 IST

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం బయల్దేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ ముందుగా గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను సీఎం పరామర్శించనున్నారు.