ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

12 Feb, 2020 14:53 IST

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. సచివాలయంలో కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్‌ బిల్లులు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో చర్చించనున్నారు.