రేపు విశాఖకు సీఎం వైయస్‌ జగన్‌

18 Apr, 2022 11:32 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11.05  గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీకానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.