తాడేపల్లి: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.