తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. ఈ సమీక్షలో.. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జాతీయ రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం భూసేకరణ, వైయస్ఆర్ జగనన్న భూహక్కు-భూ రక్ష, విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రజల నుంచి వస్తున్న ‘స్పందన’ ఫిర్యాదులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు.