ఆరాధ్య నేతకు నిండు మనసుతో నివాళి
14 Apr, 2020 08:40 IST
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆరాధ్య నేత డా. బి.ఆర్ అంబేద్కర్ కు నిండు మనసుతో నివాళులర్పిస్తున్నట్లు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇవాళ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. భారత సమాజానికి దార్శనికులు బాబా సాహెబ్. దశాబ్దాలుగా దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేద్కర్. మరణం లేని మహాశక్తి అంబేద్కర్ అని కొనియాడారు.