ఏలూరు: ఆరోగ్యశ్రీ పథకానికి ఆరాధ్యుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో సీఎం వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు సభా ప్రాంగణంలో నవరత్నాల స్టాల్స్ను సీఎం పరిశీలించారు.