తాడేపల్లి: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్రతి వారిని తమ సొంతవారిలా చూసే నర్సులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఙతలు తెలియజేశారు. `ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు నా అక్కచెల్లెమ్మలైన నర్సులు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.