తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఉంటున్న శ్యామ్ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. శ్యామ్ భార్య సుప్రియకు ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్ఆర్ సీపీ కార్యక్రమాల్లో శ్యామ్ క్రియాశీలకంగా పనిచేశారు.