నెల్లూరు బ్యారేజ్ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
6 Sep, 2022 15:08 IST
నెల్లూరు: నగరానికి సమీపంలో పెన్నా నదిపై నెల్లూరు బ్యారేజ్ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో దశాబ్దాల నెల్లూరు వాసుల కల నెరవేరింది. సాగు నీటితో పాటు నెల్లూరు, మరో 77 గ్రామాల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. నెల్లూరుతో పాటు సంగం ప్రాజెక్టులను మూడేళ్లలోనే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.