ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
26 May, 2023 14:11 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. అదే విధంగా రేపు నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరుకానున్నారు.