తాడేపల్లి: తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో శ్రీరామనవమి పండగను ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.