కాసేపట్లో శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి సీఎం వైయస్ జగన్
18 Oct, 2021 10:17 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకుని ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.