తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు`` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.