తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన రివ్యూలో డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, అంజాద్ బాషా, మంత్రి విశ్వరూప్లు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.