తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. ఈ సమీక్షలో.. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణపై చర్చించనున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్షించనున్నారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.