రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం సమీక్ష
15 Nov, 2021 14:10 IST
తాడేపల్లి: రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ.కృష్ణబాబు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ.సత్యనారాయణ, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం. ఎం.నాయక్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.