తాడేపల్లి : పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.