గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై సీఎం సమీక్ష
10 Aug, 2022 14:17 IST
తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.జాహ్నవి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.