కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం సమీక్ష
తాడేపల్లి: కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ. కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ.ఎస్. నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్ చంద్, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.