తాడేపల్లి: కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్, 104 కాల్సెంటర్, కర్ఫ్యూ అమలు వంటి తరదితర అంశాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్చించి.. పలు అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు.