తాడేపల్లి: కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా నియంతరణకు తీసుకుంటున్న చర్యలు, కర్ఫ్యూ అమలు, ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ వంటి తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. పలు కీలక అంశాలపై ఉన్నతాధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.