తాడేపల్లి: అగ్రి ఇన్ఫ్రాపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.యస్. నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.