తాడేపల్లి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ అమలుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై చర్చిస్తున్నారు.ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సమీక్షిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్పై కలెక్టర్లకు సీఎం మార్గదర్శకాలు జారీ చేశారు.పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం అమలవుతున్న తీరుపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్ల పని విభజన, వికేంద్రీకరణపై చర్చిస్తున్నారు. మద్యం, ఇసుక అక్రమ వ్యాపారంపై కొత్తగా ఏర్పడిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విధి విధానాలపై కలెక్టర్లకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు అందుతున్న వేతనంపై ఆరా తీశారు. అంఫాన్ తుపాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలెక్టర్లతో సమీక్షిస్తున్నారు.