తిరుమల: కలియుగ దైవం, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో, తలకు పట్టువస్త్రంతో కట్టిన పరివట్టంతో, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్ జగన్కు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం వైయస్ జగన్కు తీర్థప్రసాదాలు అందజేశారు. 2022 తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.