తాడేపల్లి: సివిల్స్ ఎగ్జామ్స్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’ ట్వీట్ చేశారు.