తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘరాం పాల్గొన్నారు.