పూలే విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైయస్‌ జగన్‌

28 Nov, 2019 11:09 IST

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీఎం వైయస్‌ జగన్‌ పుష్పగుచ్ఛలు వేసి నివాళులర్పించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు శంకర్‌నారాయణ, జయరాం, పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Read Also: నేరస్తుల్లో మానసిక పరివర్తన రావాలి