మహనీయులకు సీఎం వైయస్ జగన్ నివాళి
15 Dec, 2021 11:17 IST
తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో వల్లభాయి పటేల్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు.