తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావులు పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు.