విజయనగరం: విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమ బహిరంగ సభా వేదికకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ముందుగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికపైకి చేరుకొని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.