ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు ప్రారంభం
31 Jan, 2023 11:26 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా వివిధ దేశాల దౌత్యవేత్తలు, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలుత వివిధ దేశాల దౌత్యవేత్తలతో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం వైయస్ జగన్ వివరించనున్నారు. సదస్సుకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్రెడ్డి తదితరులు హాజరయ్యారు.