రిటైర్డ్‌ మేజర్‌ వేణుగోపాల్‌ మృతిపై సీఎం దిగ్భ్రాంతి

28 Apr, 2021 16:13 IST

తాడేపల్లి: రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి. వేణుగోపాల్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండియా– పాకిస్థాన్‌ యుద్ధంలో ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.