సీఆర్డీఏపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
26 Jun, 2019 17:35 IST
అమరావతి: సీఆర్డీఏపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి పరిధిలోని అక్రమ నిర్మాణాలు, బలవంతపు భూసమీకరణతో పాటు, రాజధానికి నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.