రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం వైయస్ జగన్ భేటీ
22 Aug, 2022 12:53 IST
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతిని సీఎం వైయస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతిగా ఎంపిక కావడం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.