న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో పీఎం మోడీతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. సీఎం వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎంపీలు ఉన్నారు.