విజయవాడ: గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ నోవాటెల్ హోటల్కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను సీజేఐకి అందజేసి ఘనంగా సత్కరించారు.