స్విస్ పార్లమెంట్ ప్రతినిధితో సీఎం వైయస్ జగన్ సమావేశం
23 May, 2022 18:14 IST
అమరావతి: స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు.