గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

30 Mar, 2020 17:59 IST

విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని పరిస్థితులను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.