తాడేపల్లి: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం వైయస్ జగన్ స్పందిస్తూ ‘తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు’ తెలుపుతూ ట్వీట్ చేశారు.