తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం వైయస్ జగన్ హాజరవుతారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో నూతన వధూవరులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించనున్నారు.