తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ను ప్రారంభించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం వైయస్ జగన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, పినెపె విశ్వరూప్, ఎమ్మెల్యే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.