అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించిన సీఎం
11 May, 2023 18:08 IST
విశాఖపట్నం: విశాఖలోని ఆరిలోవలో అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం రేడియేషన్ ఎక్విప్మెంట్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడిన సీఎం.. వారితో గ్రూప్ ఫొటో దిగారు. సీఎం వైయస్ జగన్ వెంట అపోలో ఆస్పత్రి యాజమాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.