వైయస్ఆర్ జిల్లా: పులివెందుల రాణితోపు సమీపంలో నెలకొల్పిన రాష్ట్రంలోని మొట్టమొదటి ఆక్వాహబ్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆక్వాహబ్లోని చేపలు, రొయ్యలు, మత్స్య వంటకాలను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. ఆక్వాహబ్ ద్వారా పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యలు మొదలైన మత్స్య సంపద ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వాహబ్లు, 14 వేల రిటైల్ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా చేపలు, రొయ్యలు పండించే రైతులకు గిట్టుబాటు లభించనుంది.