ఇలపావులూరి మురళీ మోహన్ మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం 

21 Nov, 2022 11:08 IST

తాడేప‌ల్లి: రాజకీయ విశ్లేషకులు శ్రీ ఇలపావులూరి మురళీ మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ముర‌ళీమోహ‌న్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.