రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సీఎం
12 Feb, 2024 11:37 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బీ-ఫారాలు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం వైయస్ జగన్ బీ-ఫారాలు అందించారు. అనంతరం వారు వైయస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.