క్రిస్మస్ శుభాకాంక్షలు
24 Dec, 2019 11:25 IST
వైయస్ఆర్ జిల్లా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని సీఎం వైయస్ జగన్ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.